Sunday, November 16, 2008

గరికిపాటి వారి వ్యంగ్యం

సియాటెల్ లో గరికిపాటి నరసింహరావుగారు రామాయణం మీద ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో హనుమంతుడి ఔన్నత్యాన్ని గురించి చెప్తూ ఒక చిన్న చమత్కారం విసిరారు. దాని సారాంశం.

మనం ఎవరైనా గొప్ప పని చెయ్యగానే, వాడు కులమతజాతిరాష్ట్రదేశాలలో ఏదైనా ఒక దాని రీత్యా మనవడు అని ఋజువు చేసుకుందామని చూస్తాము. ఎక్కడో గాని రామాయణం గురించి చర్చ చేస్తుంటే "అయ్యా, హనుమంతుడు రాష్ట్రం వాడు", అని అడిగారుట. ఇంకా అక్కడి గురువు ఏమి చెప్పకుండానే ఎవరో, "తమిళుడు. వనరులందరూ సౌత్ ఇండియన్స్", అన్నాడు. ఇది విన్న మరొకడు, "బాగుందయ్యా, రాముడు, సీత మాత్రం అయోధ్యలో పుట్టి హనుమంతుడు తమిళనాడులో ఎందుకు పుడతాడు? అతడు కూడా యు.పీ. వాడే", అన్నాడుట. మరొకడు "మీరు మనిషి చేసే పనిని బట్టి అతడు జాతివాడో తెలుసుకోవాలి. ఒకడు తనది కాని పనిలో వేలుపెట్టి, సొంత టికెట్ కొనుక్కుని సముద్రం కూడా దాటి, ఎవరికో విషయం చెరేసి, అక్కడ నగరం అంత తగలెట్టి వచ్చాడు అంటే - అది కచ్చితంగా తెలుగు వాడే అయ్యుండాలి", అన్నాడుట. చూసి చూసి, అటువైపుగా వెళ్తున్న ఒక ముస్లిం, "హనుమాన్ మా వాడే", అన్నాడుట. "అదేమిటయ్యా? హనుమంతుడిని ముస్లిం అని ఎలాగా చెప్తున్నావు?", అన్నాడుట. దానికి వాడు, "పేరు బట్టే చెప్పచ్చు. సులేమాన్, జలేమన్ లాగా హనూమాన్", అన్నాడుట.

ఇంట కదా చెప్పిగూడా నేను ఇలాగ చెప్పడం బాగోదు ఏమో కానీ, గరికిపాటి నరసింహారావుగారు మాకు బంధువు :) మొన్న నవంబర్ 14 వ తేదిన వారు "పాండురంగ మహాత్మ్యం" మీద వ్యాఖ్యానించడానికి బెంగుళూరు వచ్చినప్పుడు కలిసాను.

No comments: